చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు

1 Jul, 2015 17:59 IST|Sakshi
చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు

ధర్మవరం (అనంతపురం) : అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చీటింగ్ కేసు నమోదైంది. ధర్మవరం వ్యాపారి అంబటి మల్లికార్జునకు ఎంపీ రూ. 5 లక్షలు బాకీపడ్డారు. అయితే, చెల్లని చెక్కులు ఇచ్చారంటూ ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. మల్లికార్జున ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు