టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

4 May, 2016 16:54 IST|Sakshi

నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందులోభాగంగా ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య బుధవారం ఘర్షణకు దిగారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక వర్గంపై మరో వర్గం బండ బూతులు తిట్టుకుంటూ చొక్కాలు చించుకున్నారు. అనంతరం వారు కావలి పోలీస్ స్టేషన్కు చేరుకుని పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు