నారాయణ మనుష్యులు మరీ..!

12 Nov, 2023 16:14 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నరసింహ కొండ క్యాంపస్‌లోని నారాయణ కాలేజీ వార్డెన్‌గా పని చేస్తున్న హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి నెల్లూరు నగర సమీపంలో పడేశారు. హరిబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజుల క్రితం వార్డెన్ హరిబాబుకి, ప్రిన్సిపాల్ కొండారెడ్డికి మధ్య స్కూల్స్ గేమ్స్ విషయంలో వాగ్వాదం జరిగింది. కొండారెడ్డి దాడి చేయించారంటూ హరిబాబు కుటుంబ సభ్యులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: Fact Check: సచివాలయాలపైనా ఏడుపే.. 

మరిన్ని వార్తలు