నేడు నగరానికి సీఎం వైఎస్‌ జగన్‌

2 Oct, 2019 08:28 IST|Sakshi

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరు

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నగరానికి రానున్నారు. నగరంలోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరగనున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం 5.50 గంటలకు సీఎం తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 6.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి పార్కు హోటల్‌ సమీపంలోని ఎంజీఎం గ్రౌండ్స్‌కు 7.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 7.50 గంటలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 8.10 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు