ఎమ్మెల్యే అంబటికి కరోనా

23 Jul, 2020 05:43 IST|Sakshi

సాక్షి, అమరావతి/ సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీ శ్వాబ్‌ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్టు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిర వరలక్ష్మి బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో చికిత్స పొందుతున్నారు. తనకు పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్విట్టర్‌లో అంబటి తెలిపారు. 

మరిన్ని వార్తలు