తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

15 Feb, 2017 10:49 IST|Sakshi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు