ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే

6 Dec, 2019 08:20 IST|Sakshi

ఆదివారం, రెండో శనివారం వస్తున్న రెండు పర్వదినాలు

ఒక ఐచ్ఛిక సెలవు సైతం ఆదివారమే.. 

2020లో ప్రభుత్వ సెలవులను ప్రకటించిన రాష్ట్ర సర్కారు

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం. వారాంతపు సెలవురోజుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే. ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్‌ డే, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది. వచ్చే ఏడాది (2020)లో వచ్చే సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులతోపాటు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం కింద వచ్చే సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలివీ..

మరిన్ని వార్తలు