స్వగ్రామానికి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

30 May, 2015 07:57 IST|Sakshi

కలికిరి (చిత్తూరు): మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలం నగిరిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. శనివారం రాత్రి పీలేరులో తన అనుచరుడు కుమారుడైన శరత్‌కుమార్‌రెడ్డి వివాహ వేడుకులో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారని సమాచారం. కాగా, మూడు నెలల తర్వాత గ్రామానికి చేరుకున్న ఆయన్ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు