అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి

15 Mar, 2015 03:23 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి

 నరసన్నపేట : మండలంలోని రావులవలసలో హిజ్రా (వర్ధిని) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మృతి చెందింది. రావులవలస గ్రామ శివార్లులో ఈ సంఘటన జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో రాత్రి 10 గంటల వరకూ హిజ్రా శరీరం కాలుతూ ఉంది. రాత్రి 8 గంటల సమయంలో  నరసన్నపేట నుంచి స్కూటీపై వచ్చిన హిజ్రా ఒక్కసారి ఈ విధంగా మంటల్లో కాలి మృతి చెందడం గ్రామంలో సంచలనం రేపింది. అయితే గ్రామస్తులు మాత్రం ఈ సంఘటనపై ఏమీ చెప్పలేకపోతున్నారు.  కాగా హిజ్రా నరసన్నపేటలోని నక్కవీధిలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు వినియోగించే స్కూటీ సంఘటనకు సమీపంలో పార్కు చేసి ఉంది. దానికి ఆమె చున్నీ ఉంది.
 

మరిన్ని వార్తలు