వివాహిత అనుమానాస్పద మృతి

8 Mar, 2015 21:43 IST|Sakshi

వి.కోట: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జౌనిపల్లె గ్రామానికి చెందిన సరస్వతి(26)కు తీవ్ర అస్వస్థతకుగురి కాగా భర్త, అత్త కలసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సరస్వతి ఆదివారం సాయంత్రం మృతి చెందింది.

 

మృతురాలికి విష ప్రయోగంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు