శిశువు మృతి : ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

6 Jan, 2015 10:41 IST|Sakshi

తిరుపతి: తిరుపతి నగరంలోని మెటర్నటి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దాంతో బాలింత బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆమె బంధువులు ఆరోపించారు. దాంతో శిశువు మృతదేహంతో వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి... బాలింత బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు