జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు ఖమ్మం విద్యార్థిని

24 Nov, 2013 07:04 IST|Sakshi

రఘునాధపాలెం, న్యూస్‌లైన్:  జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలలో ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. లిఖితను పాఠశాల కరస్పాండెంట్ రేఖల భాస్కర్, ప్రిన్సిపాల్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీలు డి.శ్రీనివాస్, జ్శైవాసరావు తదితరులు అభినందించారు.
 

మరిన్ని వార్తలు