తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

20 Nov, 2013 21:12 IST|Sakshi

తిరుమల పుణ్యక్షేత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తిరుపతికి క్రీడారంగంలోనూ మహర్దశ పట్టనుంది. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శుంకుస్థాపన చేశారు.

శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ సమీపంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలో మహిళల మెడికల్ కాలేజీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.

>
మరిన్ని వార్తలు