భోగాపురంలో విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

20 Dec, 2015 10:50 IST|Sakshi

విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. అందులోభాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు బాధిత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే ముందస్తుగా ఎస్ కోటలో సీపీఐ నేత కామేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాల నేతలు ఈ రోజు ధర్నా నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. 

మరిన్ని వార్తలు