లాఠీఛార్జ్ కు దారి తీసిన స్థల వివాదం

21 Jan, 2015 10:17 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగనపల్లిలో స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరికి లాఠీచార్జికి దారితీసింది. చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ భర్తకు, అతని మేనల్లుడికి మధ్య స్థల విషయంలో వైరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం వివాద స్థలంలో గోడను నిర్మిస్తుండగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు