అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

9 Oct, 2015 14:54 IST|Sakshi

న్యూజెండ్ల (గుంటూరు) : పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం పాతనాగిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్‌ వలి(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బావి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు