వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు

3 May, 2020 17:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు 9 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రతి గ్రామ సచివాలయంలోనూ 10-15 బెడ్స్‌ సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లక్ష బెడ్స్‌ సిద్ధం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నచోట ఇంటికి ఒక్కరికే పాస్‌. టెలీమెడిసిన్‌ ద్వారా మందులు సరఫరా చేస్తాం. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రం ఏపీనే.. మిలియన్‌కు 2,152 పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 488 మంది డిశ్చార్జ్‌ అయ్యార’ని తెలిపారు.

మరిన్ని వార్తలు