శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచిన ఎన్ఐఏ

11 Jan, 2019 12:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుని విజయవాడ ఎంఎస్‌జే కోర్టులో శుక్రవారం హాజరు పరిచారు. ఈ నెల 25 వరకు నిందితుడికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది.

నిందితుడి తరుపు న్యాయవాదులు ఎవరూ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయక పోవడంతో కస్టడీ పిటిషన్ కాపీని నిందితుడికి కోర్టు అందజేసింది. (శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌)

మరిన్ని వార్తలు