తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

13 Dec, 2017 08:07 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం  4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు