కర్నూలు : కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలోని సిద్దప్పపాలెంలో శుక్రవారం కలుషిత నీరు తాగి 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాగు నీరు సరఫరా చేసే పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరడంతో నీరు కలుషితమైంది. అస్వస్థతకు గురైన వారు కోస్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(కోస్గి)