ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ, వీఆర్‌ఓ

7 Feb, 2015 19:54 IST|Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా దోర్నిపాడు మండల కేంద్రంలో రూ. 2 వేలు లంచం తీసుకుంటూ దోర్నిపాడు ఆర్‌ఐ వెంకటస్వామి, వీఆర్‌ఓ పుల్లారెడ్డి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు శివరామి రెడ్డి అనే రైతు నుంచి రూ. 2వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్సీ మహబూబ్ పాషా నేతృత్వంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.
(దోర్నిపాడు)

మరిన్ని వార్తలు