షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరంమెట్ట వద్ద జిల్లాలోకి అడుగుపెట్టిన షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశాఖపట్నం జిల్లాలో 10 నియోజకవర్గాల మీదుగా షర్మిల యాత్ర సాగనుంది.
తూర్పుగోదావరి జిల్లాలో 21 రోజులపాటు 13 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేసిన షర్మిల 274 కిలోమీటర్లు నడిచారు. 5 రచ్చబండలు, 11 బహిరంగ సభలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాతో 11 జిల్లాల్లో షర్మిల పాదయాత్ర పూర్తయింది.