వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి

5 Mar, 2019 08:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నాయకులు అధికారమదంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తునే ఉన్నారు. తాజాగ గుత్తి మండలం ధర్మాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయుపై టీడీపీ నేతలు రాజేంద్ర, బాలరాముడు దాడి చేసి తీవ్రంగ గాయపరిచారు.

ఈ దాడికి గల కారణం రామాంజనేయులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చేరాడనే అక్కసుతోనే అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేత రామాంజనేయులును ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు