రమ్య ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

3 Jul, 2013 15:45 IST|Sakshi

కరీంనగర్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  అన్నకూతురు రమ్య ఇంటిపై ఆ పార్టీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. టిఆర్ఎల్డి(తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేగులపాటి రమ్య  నిన్న కేసీఆర్‌ను విమర్శించారు. 

తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో చేపట్టబోయే 'వెయ్యి డప్పులు - లక్ష చెప్పులు' కార్యక్రమం పోస్టర్‌ను  విడుదల చేసిన సందర్భంగా  ఆమె మాట్లాడారు.  కెసిఆర్ నియంతృత్వ ధోరణిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.  దాంతో ఆగ్రహించిన  టిఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ఆమె ఇంటిపై దాడి చేశారు.

మరిన్ని వార్తలు