కరీంనగర్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నకూతురు రమ్య ఇంటిపై ఆ పార్టీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. టిఆర్ఎల్డి(తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేగులపాటి రమ్య నిన్న కేసీఆర్ను విమర్శించారు.
తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో చేపట్టబోయే 'వెయ్యి డప్పులు - లక్ష చెప్పులు' కార్యక్రమం పోస్టర్ను విడుదల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్ నియంతృత్వ ధోరణిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. దాంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ఆమె ఇంటిపై దాడి చేశారు.