విజయవాడలో యువతి అదృశ్యం

27 Oct, 2018 13:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో ఓ యువతి అదృశ్యమైంది. ఏజే టెక్నో కంపెనీలో పనిచేస్తున్న బందెల రేచల్‌(22) ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో చెందుతున్నారు. ఎండీ విజయ్‌ తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. యువతి అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పటమట పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు