సీఎం జగన్‌ మహిళా పక్షపాతి: వాసిరెడ్డి పద్మ

27 Sep, 2019 15:33 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుపతిలో శుక్రవారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని విధాల మహిళలకు చేయూతనిస్తున్నారని తెలిపారు. అలాగే నామినేటెట్‌ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్న గొప్ప సీఎం జగన్‌ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు