మళ్లీ బ్యాంకింగ్‌ రంగంలోకి భట్టాచార్య 

29 Mar, 2018 18:26 IST|Sakshi

మాజీ ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య మళ్లీ బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎస్‌బీఐ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన ఈమెను, బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. వినోద్‌ రాయ్‌కి తదుపరి భట్టాచార్యను నియమించబోతున్నారు. ఇప్పటికే బోర్డు తదుపరి చైర్మన్‌ ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుందని రిపోర్టు తెలిపింది. ఆశ్చర్యకరంగా భట్టాచార్యను రఘురామ్‌ రాజన్‌ తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించే నలుగురు షార్ట్‌లిస్టెడ్‌ అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు.

అయితే ప్రభుత్వం ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను నియమించారు. 1977లో ఎస్‌బీఐ చేరిన భట్టాచార్య, 2013 ఎస్‌బీఐకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఎస్‌బీఐ తొలి మహిళా చైర్మన్‌ కూడా ఈమెనే. గతేడాది అక్టోబర్‌లో భట్టాచార్య ఎస్‌బీఐ నుంచి రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమెను బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనను మెరుగుపరచడానికి 2016లో ఈ బీబీబీ ఏర్పాటైంది. దీనిలో చైర్మన్‌తో పాటు ముగ్గురు ఎక్స్‌-అఫిషియో మెంబర్లు, ముగ్గురు ఎక్స్‌పర్ట్‌ మెంబర్లు ఉంటారు. అందరూ సభ్యులు, చైర్మన్‌ కూడా పార్ట్‌టైమే.  

మరిన్ని వార్తలు