‘మాన్స్టర్–797’, ‘మల్టీస్ట్రాడ–950’ మోడళ్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్బైక్స్ తయారీ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా రెండు కొత్త బైక్స్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. మాన్స్టర్–797, మల్టీస్ట్రాడ–950 అనే ఈ మోడళ్ల ధరలు వరుసగా రూ.7.77 లక్షలు, రూ.12.6 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. కంపెనీ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురావాలని భావించిన ఐదు మోడళ్లలోనివే తాజా రెండు బైక్స్. ‘కంపెనీ ప్రొడక్టుల విస్తరణలో తాజా బైక్స్ ఆవిష్కరణ అనేది చాలా కీలకమైన అంశం. భారత మార్కెట్లో వాటా పెరుగుదలకు ఇవి దోహదపడతాయని విశ్వసిస్తున్నాం’ అని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలుర్ తెలిపారు.
హైదరాబాద్లో ఔట్లెట్
ఈ ఏడాది హైదరాబాద్, కోల్కతా, చెన్నై నగరాల్లో కొత్తగా ఔట్లెట్స్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.