చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి

12 Feb, 2018 16:33 IST|Sakshi
ప్రమాదం జరిగిన ప్రాంతం

జార్ఖండ్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ని ఢీకొట్టి చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సడార్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం డంకా జిల్లాలోని  లాగ్లా గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన కారు రోజూ న్యూస్‌పేపర్లు తీసుకెళ్లే కారుగా గుర్తించారు. కారు బాగల్‌పూర్‌ నుంచి డంకా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు