అమీర్పేట: టీవీ యాంకర్ రవి అనుచరులు తమను భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని స్టేషన్కు పిలిచిపించి
విచారించారు. ఫిర్యాదు దారుడు సందీప్తో మాట్లాడిన రవి ఆర్థిక లావాదేవీల విషయంలో వాగ్వాదం జరిగిందని, సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణకు తెలిపి సందీప్ను వెంట పెట్టుకుని వెళ్లాడు.
కాగా రవికి తాను రూ.28 వేలు ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని, అందుకు ఇంకా గడువుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అయితే డబ్బులు ముందుగానే చెల్లించాలని గత కొన్ని రోజులుగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిపాడు. మధురానగర్లోని రవి స్నేహితుడు లోబో వస్త్రదుకాణానికి పిలిపించి దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. సమస్యను పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారుడు చెప్పినందున కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.