నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి

15 Apr, 2020 12:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన నక్కలవెల్లి రాజాగా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలలుగా చేపల చెరువువద్ద పిట్టలు తోలడానికి కాపలాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండవల్లి పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు