నగరంలో భారీ వర్షానికి 8మంది మృతి

31 Aug, 2016 15:19 IST|Sakshi
నగరంలో భారీ వర్షానికి 8మంది మృతి

హైదరాబాద్ : నగరంలో కురిసిన భారీ వర్షానికి ఇప్పటివరకూ 8మంది చనిపోయినట్లు సమాచారం ఉందని తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, తాజా పరిస్థితులు, సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు.

నగరంలో పురాతన భవనాలు కూల్చివేతపై డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని పురాతన భవనాలు కూల్చివేతలు నిలిచిపోయినట్లు చెప్పారు.  తాజా పరిస్థితులపై మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో నివేదిక అందిస్తామన్నారు. రేపు కూడా వర్షం కురుస్తుందన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు