బేగంపేటలో ఏసీబీ సీటీరేంజ్ అధికారుల రైడ్

3 Aug, 2014 06:43 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఆదివారం ఏసీబీ సీటీరేంజ్ అధికారులు రైడ్ జరిపారు. చలానా లేకుండా వాహనాదారులనుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 16వేల రూపాయాలకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బేగంపేట సీఐ సహా 15మందిపై ఏసీబీ కేసు నమోదు చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు