ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్

28 Jun, 2016 12:21 IST|Sakshi
ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు పీవీ : కేసీఆర్

హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశకుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...సర్పంచ్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ పీవీ అని కొనియాడారు. మానవ వనరుల అభివృద్ధి కాముకుడిగా పీవీకి సుస్థిర స్థానముందన్నారు.

మరిన్ని వార్తలు