డివైడర్‌ను బైక్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

18 Sep, 2015 15:13 IST|Sakshi

ఆదిభట్ల(రంగారెడ్డి): సాగర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. బాలాపూర్ జనప్రియ అపార్టుమెంట్‌లో ఉంటూ ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రాహుల్(22) స్నేహితుడితో కలసి బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. వారు వెళ్తున్న వాహనం మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందగా అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు