నకిలీ బ్రాండెడ్ వస్త్రాలు సీజ్: కేసు నమోదు

4 Jun, 2016 11:37 IST|Sakshi

హైదరాబాద్: నకిలీ బ్రాండెడ్ వస్త్రాలను విక్రయిస్తున్న రెండు షాపులపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. ఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలోని అటైర్స్, గ్రాబిట్ పేరుతో ఉన్న దుకాణాల్లో నకిలీ ముఫ్తి జీన్స్ విక్రయిస్తున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు సదరు షాపులపై దాడి చేసి... 49 ప్యాంట్లు, టీ షర్టులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. షాపు యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు