కాలేజీ పైనుంచి దూకి సుకన్య ఆత్మహత్య

15 Jun, 2016 22:43 IST|Sakshi
కాలేజీ పైనుంచి దూకి సుకన్య ఆత్మహత్య

హైదరాబాద్: ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని కొంపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది.

ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన సిల్వేరు సుకన్య(16) కొంపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుకన్య బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు