30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌

2 Nov, 2016 03:20 IST|Sakshi
30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌

హైదరాబాద్‌: కేవలం 30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పొందేందుకు సాక్షి ‘ఎడ్జ్‌’ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సును అందిస్తోంది. విద్యా సంబంధ విషయాల్లో.. వ్యక్తిగత, వృత్తి సంబంధిత అభివృద్ధికి బాటలు వేసే శిక్షణ అందించడంలో అగ్రగామిగా సాక్షి ‘ఎడ్జ్‌’ పేరొందింది.

ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతులు.. నేర్చుకునేందుకు అనువైన, చక్కని ప్రేరణ కలిగించే వాతావరణాన్ని ఏర్పరచి, శిక్షణ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించి విజయం వైపు నడిపిస్తాయి. ప్రపంచ భాష ఇంగ్లిష్‌తో పరిచయం, ఇంగ్లిష్‌లో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ–లింకింగ్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని అనవసర భయాలను అధిగమించడం, వాయిస్‌–యాక్సెంట్, ముఖ్యమైన గ్రామర్‌ వంటి ఆరు అంశాలతో ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సును రూపొందించారు.

నవంబర్‌ 8న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ కోర్సు వ్యవధి 30 రోజులు. ఫీజు రూ. 4,600. రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తరగతులు జరుగుతాయి. సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. మరింత సమాచారం కోసం 96035 33300 నంబర్‌లో లేదా sakshiedge@gmail.com మెయిల్‌లో సంప్రదించవచ్చు. లేదా సాక్షి ఎడ్జ్, 8–2–696, క్యారమెల్‌ పాయింట్, రోడ్‌ నంబర్‌ 12, హైదరాబాద్‌–34 అడ్రస్‌లో నేరుగా సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు