టుడే న్యూస్ అప్డేట్స్

13 Jul, 2016 06:58 IST|Sakshi

► నేడు తెలంగాణ ఎంసెట్-2 ర్యాంకుల వెల్లడి. సాయంత్రం ర్యాంకులు వెల్లడించనున్న మంత్రి లక్ష్మారెడ్డి

► ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. అలాగే, కుక్కునూరులో పోలవరం నిర్వాసితుల రిలే దీక్షకు వైఎస్ జగన్ మద్దతు తెలపనున్నారు.

► హైదరాబాద్: గోల్కొండ పోలీస్‍స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 350 మంది పోలీసులతో వెస్ట్జోన్ డీజీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముమ్మర తనఖీల‍్లో 25మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

► భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. నీటిమట్టం 51 అడుగులకు చేరింది.

► నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలో మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న నలుగురు అక‍్కడికక్కడే మృతి చెందారు.

► చిత్తూరు: నేడు సంపూర్ణ పశుమేత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రులు పుల్లారావు, బొజ్జల

► హైదరాబాద్:  నేటితో ముగియనున్న ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువు

మరిన్ని వార్తలు