అమిత్ షా పర్యటన
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నేడు నల్లగొండ జిల్లాలో అమిత్ షా రెండో రోజు పర్యటనలో భాగంగా.. వెలుగుపల్లిలో పండిట్ దీన్దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం చినమాధారం, దేవులపల్లిలో గ్రామస్తులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు నల్లగొండలో ప్రెస్మీట్లో పాల్గొంటారు.
రెండు రోజులు వడగాల్పులు
తెలంగాణలో మంగళ, బుధవారాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ప్రధాని గుజరాత్ పర్యటన
నేడు గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో రోజు పర్యటన. గాంధీనగర్లో జరిగే ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏఎఫ్బీడీ) గ్రూప్ వార్షిక సమావేశానికి ఆయన హాజరవుతారు.
పులివెందులకు వైఎస్ జగన్
వైఎస్ఆర్ జిల్లా: నేడు పులివెందులలో పర్యటించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొననున్న వైఎస్ జగన్.
టీఎస్ సెట్ హాల్టికెట్లు
హైదరాబాద్: టీఎస్ సెట్ హాల్ టికెట్లను బుధవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
గవర్నర్ పర్యటన
నేడు అనంతపురం జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు.