'సరోజినిదేవి' వైద్యులపై చర్యలు : మంత్రి లక్ష్మారెడ్డి

9 Jul, 2016 19:51 IST|Sakshi

హైదరాబాద్: సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దుష్ప్రచారంతో పేద రోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అవిభక్త కవలలు వీణా-వాణీలను స్టేట్ హోమ్కు తరలించాలని చూస్తున్నామని మంత్రి వెల్లడించారు. కలరా, ఇతర విష జ్వరాలపై భయపడాల్సిన పనిలేదని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. సరోజినిదేవి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని కొందరు అంధులుగా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు