హోదా కోసం నేడు ఢిల్లీకి వైస్‌ జగన్‌

8 Aug, 2016 04:11 IST|Sakshi
హోదా కోసం నేడు ఢిల్లీకి వైస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ సాయంత్రం 6:45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుకు మద్ధతు ఇస్తున్న మరికొన్ని జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతి ప్రణబ్ ను కలుసుకుని రాష్ట్ర విషయాలను ఆయనకు వివరించనున్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు తెలిపి, ఇవ్వని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ తన పార్టీ ప్రతినిధులతో కలిసి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలసి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు