ఖరీదైన సమాధులు

18 Apr, 2016 09:42 IST|Sakshi
ఖరీదైన సమాధులు

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న స్థానిక చైనీయుల సమాధుల మధ్యనుంచి నడుస్తుంటే.. విలాసవంతమైన కాలనీ మధ్యనుంచి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. రెండు వీధుల్లో విస్తరించి ఉన్న ఈ సమాధుల్లో కొన్ని రెండుమూడంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. చెప్పుకోవడానికి అవి సమాధులే కాని వాటిలో ఏసీ, టాయిలెట్, ఆధునిక వంటగది వంటి సమస్త సదుపాయాలన్నీ ఉంటాయి. మరణించిన వారి బంధువులు వారాంతాల్లో ఈ సమాధులను సంద ర్శించి తమ పూర్వీకులకు ఆహారం, సుగంధ ద్రవ్యాలను సమర్పిస్తుంటారు.

మిలియనీర్స్ రో, లిటిల్ బ్రేవర్లీ హిల్స్ అనే రెండు వీధులున్న ఈ శ్మశానవాటికను 19వ శతాబ్దం చివరి భాగంలో ఏర్పాటు చేశారు. స్థానిక కేథలిక్కులు తమ శ్మశానాల్లో చైనీయులను ఖననం చేయనివ్వకపోవడంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో మనీలాకు వలసవచ్చిన చైనీయులు వ్యాపారంలో రాణించి సంపన్న వర్గంగా రూపాంతరం చెందారు. తమ స్థాయికి గుర్తుగా ఈ ఖరీదైన సమాధుల్ని నిర్మించారు.      - మనీలా

మరిన్ని వార్తలు