రస్‌ అల్‌ఖైమాలో తెలుగు తరంగిణి వేడుకలు

17 Jan, 2017 03:17 IST|Sakshi

రస్‌ అల్‌ఖైమా: తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యూఏఈలోని రస్‌ అల్‌ఖైమాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. భోగిమంటలు, హరిదాసుల సందడి, శ్రీగోదా రంగనాథుల కళ్యాణం, తిరుప్పావై, అన్నమయ్య కీర్తనలు, సామూహికవిష్ణుసహస్ర నామార్చన, కూచిపూడి నృత్యాలతో కన్నులపండువగా సాగింది. తర్వాత రంగవల్లుల పోటీ, భోగిపళ్లు, బొమ్మలకొలువు, జానపదనృత్య ప్రదర్శనలతో సుమారు వేయిమంది తెలుగువారు పల్లెలోని సంక్రాంతిని రస్‌అల్‌ఖైమాలోఆవిష్కరించారు. తెలుగు తరంగిణి అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు మోహన్‌ కార్యక్రమ బాధ్యతలు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి సాక్షి మీడియా సహకారం అందించింది.

మరిన్ని వార్తలు