ఇంగ్లండ్లో కాల్పుల కలకలం

19 Jul, 2016 20:14 IST|Sakshi

లండన్: బ్రిటన్లో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో దాడిచేసిన వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. మహిళలను తల్లీకూతురుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

లింకన్షైర్లో కాస్ట్లె స్విమ్మింగ్ పూల్ సమీపంలో నిందితుడు ఇద్దరు మహిళలను కాల్చి చంపి, తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు