సస్పెన్స్‌ థ్రిల్లర్‌

23 Dec, 2019 01:08 IST|Sakshi
ఆది సాయికుమార్‌

ఆది సాయికుమార్‌ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా తర్వాతి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు ఆది. డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ వద్ద పనిచేసిన జి.బి.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మహంకాళీ మూవీస్‌ పతాకంపై మహంకాళీ దివాకర్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మహంకాళీ దివాకర్‌ మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది.

హిట్‌ కొట్టాలని కసి మీద ఉన్న ఆదికి సరైన కథ దొరికింది. జీబీ కృష్ణ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు ఆది. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమాని నిర్మించనున్నాం. జనవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వాహణ : శంకర్‌.

మరిన్ని వార్తలు