ఏప్రిల్‌లో ’నిశ్శబ్దం’గా అనుష్క

8 Feb, 2020 15:59 IST|Sakshi

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం విడుదలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘నిశ్శబ్దం’చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.

తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. ఏప్రిల్‌ రెండో తేదీని సినిమా విడుదల చేయనున్నట్లు కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ‘నిశ్శబ్ధం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

>
మరిన్ని వార్తలు