ఎవరు?

1 Oct, 2016 01:36 IST|Sakshi
ఎవరు?

నవీన్, గౌతమ్, ప్రియాంక, సరయు, చలపతిరావు, సమీర్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరో తానెవరో’. బాబ్జీ దర్శకత్వంలో ఎస్.కె.రెహమాన్ (చంటి) నిర్మించారు. టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, లోగోను నటుడు చలపతిరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. ఆ ఆసక్తితో ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించడంతో పాటు నిర్మించా’’ అన్నారు. ‘‘ఎప్పటికైనా డెరైక్టర్ అవుతావని నటుడు శ్రీహరిగారు అనేవారు. ఈ చిత్రంతో అది నెరవేరింది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కపిల్ వరికూటి.