సమాజ చైతన్యం కోసం...

5 Jun, 2014 01:04 IST|Sakshi
సమాజ చైతన్యం కోసం...

మధు, సుధీర్, ఇషా, జయంతి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘పవనిజం’. ఈ.కె. చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కనిష్క పాటలు స్వరపరిచారు. ఈ నెల మూడో వారంలో పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బుధవారం ప్రచార గీతాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘సామాజిక స్పృహతో పవన్‌కల్యాణ్ మాట్లాడే ప్రతి మాటా యువకులలో చైతన్యాన్ని కలిగిస్తుంది.
 
ఆ చైతన్యం నుంచి పుట్టినదే పవనిజం. అభిమానులు కేవలం పవన్ సినిమాలను అభిమానించడం మాత్రమే కాదు.. ఆయన భావాలకు అనుగుణంగా సమాజ సేవ చేయడం అనేదే పవనిజం. పవన్ అభిమానులు తల్చుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చనేది ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ డోలా, ఎడిటింగ్: సత్య.