సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

4 Aug, 2019 01:52 IST|Sakshi
ఇసాబెల్లా, ఆయుష్‌

ఇండియా–మయన్మార్‌ బోర్డర్‌ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు సల్మాన్‌ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ. ఆయుష్‌కు తోడుగా కత్రినా కైఫ్‌ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్‌ కూడా వెళ్లనున్నారు. ఓ సినిమా కోసం ఇద్దరూ ఇలా తోడయ్యారు. ఈ చిత్రానికి కరణ్‌ భూతాని దర్శకత్వం వహిస్తారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం.

ఇందులో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా బాగా కష్టపడుతున్నాను. ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఆయుష్‌ శర్మ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలీవుడ్‌లో ఇసాబెల్లాకు ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు ‘టైమ్‌ టు డ్యాన్స్‌’ అనే సినిమా కమిట్‌ అయ్యారామె. ఇది చిత్రీకరణలో ఉండగానే రెండో సినిమాకి అవకాశం తెచ్చుకోగలిగారు.

>
మరిన్ని వార్తలు